నన్ను చంపేందుకు కుట్ర జరిగింది....

 

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన హత్యకు కుట్ర జరిగిందని.. తనను అంతమొందించేందుకు  ఓ రాజకీయ పార్టీ కిరాయి హంతకులను కూడా నియమించుకుందన్నారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె..  ‘‘నన్ను చంపేందుకు కుట్ర జరిగినట్టు నా దృష్టికి వచ్చింది. ఇందుకోసం ఓ పార్టీ సుపారీ కూడా ఇచ్చింది. అడ్వాన్స్ తీసుకున్న కిరాయి హంతకులు నా నివాసం, కార్యాలయం, ఇతర సమీప ప్రాంతాల్లో రెక్కీ కూడా నిర్వహించారు’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుట్రదారులు రోజూ తనను దూషిస్తూ ముందు వ్యక్తిత్వాన్ని దెబ్బతీసి, ఆ తర్వాత శాశ్వతంగా తనను తొలగించే ప్రణాళికతో ఉన్నట్టు చెప్పారు. అయితే, తనకు ఇవి అలవాటైపోయాయని, గతంలో కుట్రల నుంచి తాను ప్రాణాలతో బయపడ్డానన్నారు.