మళ్లీ బుక్కయిన బేజేపీ.. ఈసారి మమతా బెనర్జీ శూర్పణక...


గతంలో కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి పార్లమెంట్లో నవ్వినందుకుగాను ఆమెను శూర్పణకతో పోల్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ వ్యవహారం పెద్ద దుమారమే రేపింది. మళ్లీ ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలే చేశారు. అయితే ఈసారి చేసింది బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్. అది కూడా బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు నోరును అదుపులో ఉంచుకోవాలని, ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మసలుకోవాలని ప్రధాని మోడీ సూచించిన రెండు రోజులకే. మోడీ మాటలను తుంగలో తొక్కి సురేంద్ర సింగ్ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీని రావణాసురుడి సోదరి సూర్పణఖతో పోల్చారు. ‘‘మమతా బెనర్జీ సూర్పణఖ పాత్రను పోషిస్తున్నారు. వీధుల్లో ప్రజలను చంపుతున్నా ముఖ్యమంత్రిగా ఆమె ఏమీ చేయడం లేదు. బెంగాల్లో హిందువులకు రక్షణ లేదు. ఇలానే వదిలేస్తే పరిస్థితి జమ్మూ కశ్మీర్ తరహాలో మారిపోతుంది. జమ్మూ కశ్మీర్ నుంచి హిందువులు వలస వెళ్లిన పరిస్థితే పశ్చిమబెంగాల్లోనూ ఏర్పడుతుంది’’ అని సురేంద్ర సింగ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ రావణ పాత్రను పోషిస్తుందని విమర్శించారు. మరి దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.