కోల్‌కతాలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన వంతెన

 

కోల్‌కతాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.. మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఆలీపోర్‌ ప్రాంతంలో మజర్‌హట్‌ వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది.. ఈ ప్రమాదం జరిగినప్పుడు వంతెనపై పలు వాహనాలు తిరుగుతున్నాయి.. ఈ ఘటనలో కార్లు, బస్సులలో ప్రయాణిస్తున్న పలువురు వంతెన శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది.. కొందరిని స్థానికులు రక్షించి ఆసుపత్రికి తరలించారు.. సహాయక సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.. కోల్‌కతాలోని అత్యంత పురాతన వంతెనల్లో ఇది కూడా ఒకటి. గత కొద్ది రోజులుగా ఇక్కడ వర్షాలు పడుతుంటడంతో వంతెన కూలిపోయి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.