18 మార్గాలు... 40వేల మంది పోలీసులు.... మహానిమజ్జానికి మహానగరం సిద్ధం

 

మహానిమజ్జన మహోత్సవానికి హైదరాబాద్ మహానగరం సిద్ధమైంది. మొత్తం 18 ప్రధాన మార్గాల్లో జరగనున్న శోభాయాత్రకు పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. నగరవ్యాప్థంగా 40వేల మంది పోలీసులను మోహరిస్తున్నారు. ఒకవైపు లా-అండ్-ఆర్డర్... మరోవైపు ట్రాఫిక్ పోలీసులతో... పకడ్బందీ చర్యలు చేపట్టారు. గణేష్ శోభాయాత్రలో ఏ చిన్న ఇబ్బందీ తలెత్తకుండా టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే శోభాయాత్రను గూగుల్‌ లింక్ సిస్టిమ్‌తో కనెక్ట్ చేయనున్నారు. ఇక ఓల్డ్ సిటీ సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలను రంగంలోకి దింపుతున్నారు. 305 సమస్యాత్మక, 610 అతి సమస్మాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలను మోహరిస్తున్నారు. అలాగే 450కి పైగా సీసీ కెమెరాలను వినియోగిస్తున్నారు. అదేవిధంగా బాలాపూర్‌-ట్యాంక్ బండ్ ‌రూట్‌లో మొత్తం 21 కిలోమీటర్ల మేర శోభాయాత్ర జరగనుండటంతో... సున్నితమైన ప్రాంతాల్లో పారామిలటరీ బలగాలను మోహరిస్తున్నారు. ఇక మహానిమజ్జనం రోజు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా హైదరాబాద్‌లో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు.