రోడ్డు ప్రమాదం..మాగంటి రూపకు గాయాలు

 

రాజమండ్రి ఎంపీ, సినీ నటుడు మురళీ మోహన్ కోడలు, రాజమండ్రి టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగంటి రూప రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారు. హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయం సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు ఇవాళ ఉదయం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మాగంటి రూప గాయపడ్డారు. ఆమె కుమార్తెకు కూడా స్వల్పగాయాలయ్యాయి. దీంతో జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అనంతరం డిశ్చార్జ్‌ అయ్యారు.