జగన్ పార్టీలో చేరిన బాల రాజు

 

 

 

విశాఖపట్నం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఈ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఎం.బాల రాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

 

ఆ పార్టీ నేతలు పార్లమెంట్ సభ్యుడు సబ్బం హరి, మాజీ శాసనసభ్యుడు కుంభ రవి బాబుల సమక్షంలో ఆయన జగన్ పార్టీ తీర్ధం పుచ్చుకొన్నారు.

 

బాల రాజు చేరికతో ఈ జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో పార్టీ మరింత బలపడే అవకాశం ఉంది. బాల రాజు కు ఈ ప్రాంతాల్లో బలమైన పట్టు ఉంది. అలాగే, ఆయన జగన్ పార్టీలో చేరడంతో విశాఖపట్నం నగరంలో కాంగ్రెస్ పార్టీ కొంత మేరకు దెబ్బ తిన్నట్లే.