చంద్రబాబు స్థానంలో లోకేష్..!!

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. అప్పుడే రాజకీయ పార్టీల గెలుపోటముల గురించి, నియోజకవర్గాల్లో అభ్యర్థుల గురించి చర్చ మొదలైంది.. అయితే ఇప్పుడు చంద్రబాబు ఎన్నో ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం చర్చనీయాంశమైంది.. వచ్చే ఎన్నికల్లో కుప్పం నుండి లోకేష్ బరిలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది.

 

 


లోకేష్ వచ్చేఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇక అప్పటి నుండి లోకేష్ ఆ స్థానం నుండి పోటీ చేయబోతున్నాడు, ఈ స్థానం నుండి పోటీ చేయబోతున్నాడంటూ ఒకటే వార్తలు.. తాజాగా లోకేష్ పోటీ చేస్తున్న స్థానం గురించి ఓ కొత్త వార్త మొదలైంది.. అదే లోకేష్ కుప్పం నుండి పోటీ చేయబోతున్నారట.. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజక వర్గం మీద లోకేష్ కి కూడా మంచి పట్టుంది.. కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను లోకేష్ దగ్గరుండి అమలుచేసారు.. అలానే స్థానిక నేతలతో కూడా మంచి సంబంధాలున్నాయి.. దీంతో లోకేష్ కుప్పం నుండి పోటీ చేస్తే బాగుంటుందని ఆయన కుటుంబసభ్యులు, పార్టీ నేతలు భావిస్తోన్నారట.. మరోవైపు చంద్రబాబు కూడా ఈసారి గుంటూరు జిల్లా మంగళగిరి నుండి పోటీ చేయబోతున్నట్టు తెలుస్తోంది.. రాజధాని ప్రాంతం కావడంతో అక్కడ నుంచి పోటీ చేస్తే, ఆ ప్రాంతం త్వరగా అభివృద్ధి చెందుతున్న భావనతో ఉన్నారట.. చూద్దాం ఏం జరుగుతుందో.