శాసనమండలి అభ్యర్దుల పేర్లు ప్రకటించిన తెదేపా

 

త్వరలో జరగనున్న శాసనమండలి ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ తెలంగాణా మరియు గోదావరి జిల్లాలకు తన అభ్యర్ధులను ప్రకటించింది. ఆదిలాబాద్, నిజామాబాదు, కరీంనగర్ మరియు మెదక్ జిల్లాల పట్టభద్రుల నియోజక వర్గానికి ఆదిలాబాద్ కు చెందిన కే.చంద్ర శేకర్ రావును, ఉభయ గోదావరి జిల్లాలకు మాగంటి బాబు మద్దతు ఉన్న కనుమిల్లి సూర్యనారాయణ రావు (చినబాబు)ను తమ అభ్యర్దులుగా ప్రకటించింది. మొదట గాదిరాజు బాబును తమ అభ్యర్ధిగా నిలబెట్టాలని పార్టీ భావించినప్పటికీ, అయన ఆసక్తి చూపకపోవడంతో కనుమిల్లికి అవకాశం దక్కింది.