లాలూ కూతురి సీఏ అరెస్ట్..

 

బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ పై ఇప్పటికే పలు అవినీతి అరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతికి చెందిన డొల్ల కంపెనీల వ్యవహారంపై ఈడీ విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే మనీలాండరింగ్ కేసులో ఛార్టెర్డ్ అకౌంటెంట్ రాజేశ్ అగర్వాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.