అఖిలేశ్ పోటీ.. లూలు కొడుకుతో ప్రచారానికి సిద్దం...

 

ఉత్తరప్రదేశ్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో భాగంగా పార్టీలన్నీ ప్రచారానికి రంగం సిద్దం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో  ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ కూడా ఎన్నికల ప్రచారానికి సిద్దమవుతున్నారు. ఈసారి ఆయనతో పాటు ఆయన కుమారుడు, బిహార్‌ డిప్యూటీ ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ కూడా ప్రచారంలో పాల్గొంటారని లాలూ తెలిపారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. యాదవ్ ప్రకటించారు. అఖిలేష్ విజయం సాధించే దిశగా ఆయన తరపున ప్రచారం నిర్వహించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని..యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ పోటీ చేయదని ఆయన స్పష్టం చేశారు. సమయం వృథా చేయకుండా నేతాజీ అఖిలేశ్‌ని ఆశీర్వదించాలని, వ్యతిరేక శక్తులను ఎదుర్కోవాలంటే తండ్రీకొడుకులు ఏకం కావాలని లాలూ కోరారు. యూపీలో భాజపా అధికారంలోకి వస్తే ఎవరూ సహాయం చేయలేరని..భాజపాను ఓడించి ఎన్నికల్లో గెలుపొందాలంటే కాంగ్రెస్‌ తో పొత్తు పెట్టుకోవడం మంచి పరిణామని తెలిపారు.