బయటకొచ్చిన లగడపాటి...కేసీఆర్ పై పొగడ్తలు

 

రాష్ట్ర విభజన తరువాత లగడపాటి రాజగోపాల్ దాదాపు రాజకీయాలకు దూరమయ్యారు. దాదాపు చాలా రోజుల తరువాత రాజగోపాల్ మళ్లీ తెరపైకి వచ్చాడు. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న రాజగోపాల్..బయటకు వచ్చీ రాగానే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. యాదాద్రి ఆలయాన్ని ప్రపంచస్థాయి పుణ్యక్షేత్రంగా మార్చడానికి ముఖ్యమంత్రి చేస్తున్న కృషి హర్షనీయమని, ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని విశ్వవ్యాప్తం చేయాలని పట్టుదలతో ఉన్న సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని ఆయన పొగడ్తల వర్షం కురిపించారు. యాదాద్రి అభివృద్ధి పనులు దిగ్విజయంగా కొనసాగాలని కోరుకుంటున్నాని, ఇంతకుముందు యాదాద్రి రూపురేఖలు మారబోతున్నాయని మీడియాలో మాత్రమే చూశానని, ఇప్పుడు ప్రత్యక్షంగా తిలకించానని రాజగోపాల్ అన్నారు. ఇంతకుముందు యాదాద్రిని సందర్శించుకున్న తర్వాతే తాను ఎంపీగా గెలిచానని కూడా లగడపాటి చెప్పారు.