మౌనిక కుటుంబానికి రూ.20 లక్షలు నష్టపరిహారం

 

కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి హరికాంత్‌ రెడ్డి భార్య మౌనిక అమీర్‌పేట మెట్రోస్టేషన్‌ పిల్లర్‌ పెచ్చులు ఊడిపడటంతో మరణించిన సంగతి తెలిసిందే. మృతి చెందిన మౌనిక కుటుంబసభ్యులకు రూ.20 లక్షలు నష్టపరిహారం ఇచ్చేందుకు ఎల్ అండ్ టీ సంస్థ అంగీకరించింది. దీంతో పాటు ఇన్సూరెన్స్ కింద ఎంత వస్తే అంత మొత్తం, కుటుంబసభ్యులకు ఒక ఉద్యోగం ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారని సమాచారం.