కారులో మంటలు..ముగ్గురు సజీవ దహనం

కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి నంద్యాల వైపు వెళ్తున్న కారు ఆళ్లగడ్డ సమీపంలోని బత్తలూరు సమీపంలో  ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న మట్టిదిబ్బలను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి..దీంతో కారులో ప్రయాణిస్తోన్న నలుగురిలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. వీరిని ప్రొద్దుటూరుకు చెందిన వనితాబాయి, రాజాప్రసాద్, ప్రేమ్‌కుమార్, ఉమేష్‌గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన రాజాప్రసాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు అతని పరిస్థితి విషమంగా ఉంది.