కేజ్రీవాల్ కు షాక్.. ఆప్ కీలక నేత జంప్..

 

ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీ ఫిరాంపులు కూడా ఎక్కువయ్యాయి. ఇప్పటికే చాలా మంది నేతలు తమకు ఇష్టమొచ్చిన పార్టీల్లో చేరుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ కు కూడా భారీ షాక్ తగిలింది. పార్టీ అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న కుమార్ విశ్వాస్ ఆప్ పార్టీని వీడనున్నట్టు తెలుస్తోంది. ఆప్ ను వీడి బీజేపీలోకి అడుగుపెట్టబోతున్నారు. దీనిలో భాగంగానే ఆయనకు బీజేపీకి మధ్య చర్చలు దాదాపు పూర్తి కావొచ్చాయని, బీజేపీలోకి అడుగుపెడుతున్న విషయంపై ఆయన ఏ సమయంలోనైనా అధికారికంగా ప్రకటించవచ్చని సమాచారం. అంతేకాదు విశ్వాస్‌ కుమార్‌ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని సహిబాబాద్‌ నుంచి పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌కు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున ఇక నిర్ణయం కూడా త్వరగానే వెలువడనుందని బీజేపీ వర్గాల సమాచారం. మరి ఎన్నికల సమయానికి ఇంకెంత మంది పార్టీలు మారుతారో చూద్దాం..