రాజకీయ సన్యాసం తీసుకుంటా..! - కేటీఆర్

 

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి.. అధికార పార్టీ తెరాస, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పరస్పరం విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నాయి.. మొన్నటికి మొన్న కేటీఆర్ 'తెలంగాణ ఇచ్చింది అమ్మా కాదు బొమ్మా కాదు' అంటూ సోనియా గాంధీ గురించి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. కేటీఆర్ వ్యాఖ్యలు పట్ల పలువురు కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కూడా 'రానున్న ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎ్‌సకు, మంత్రి కేటీఆర్‌కు బుద్ధి చెబుతారని' ట్విట్టర్ వేదికగా స్పందించారు.. దీనికి బదులుగా కేటీఆర్, వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలిచి అధికారంలోకి రాకపోతే గతంలో తాను ప్రకటించినట్లు రాజకీయ సన్యాసం తీసుకుంటానని పునరుద్ఘాటించారు.. కాంగ్రెస్‌ అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఉత్తమ్‌ ప్రకటించారని.. ఆయన తన మాటను నిలుపుకొన్నా, లేకున్నా తాను మాత్రం తన మాటకు కట్టుబడి ఉంటానని కేటీఆర్ స్పష్టం చేశారు.