మాజీ స్పీకర్ కోడెల కన్నుమూత!!

 

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తుదిశ్వాస విడిచారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని తన ఇంట్లో ఆయన ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన నగరంలోని బసవతారకం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆయన మృతిచెందారు.

గత కొన్ని రోజులుగా, తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని, పరువు తీయాలని చూస్తున్నారని కోడెల ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత కోడెల కుమారుడి, కుమార్తె పై పలు ఆరోపణలు వచ్చాయి. అసెంబ్లీ ఫర్నీచర్ ను సొంతానికి వాడుకున్నట్టుగా కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన కోడెల ఆత్మహత్య చేసుకున్నారు.