సీఎం కిరణ్ చప్రాసీయా
posted on Feb 4, 2013 4:58PM
సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని ఢిల్లీకి అధిష్టానం పిలిపించడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అపహాస్యం చేశారు. తెలంగాణలోని పరిస్థితులు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి, ప్రధాని మన్మోహన్ సింగ్లకు తెలియవా అని ఆయన ప్రశ్నించారు. ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఓ చప్రాసీయా అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇక్కడీవన్ని మోసుకుపోయి ఢిల్లీకి అందించే డ్యూటీ ముఖ్యమంత్రిదయినట్టు కనిపిస్తోందన్నారు.
తెలంగాణపై సంప్రదింపులు జరుపుతామని కేంద్ర పెద్దలు చెబితే.. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ఆధ్వర్యంలో గత నెల జరిగిన అఖిలపక్ష సమావేశాన్ని అవమానించినట్లేనని ఆయన అన్నారు. తెలంగాణపై నాన్చకుండా వెంటనే తేల్చాలన్నారు. తెలంగాణలో ఆత్మహత్యలకు కారణం సోనియానేనని ఆరోపించారు.