కేసీఆర్ శాడిస్ట్ గా మారిపోయారు!
posted on Jun 7, 2013 12:11PM
టీఆర్ఎస్ ఆధినేత కేసీఆర్ శాడిస్ట్ గా మారిపోయారా! సొంత పార్టీ కార్యకర్తలే ఆయనను శాడిస్ట్ గా అభివర్ణిస్తున్నారు. అదేంటీ.. ఇంత సడన్ గా కేసీఆర్ శాడిస్ట్ గా ఎలా మారిపోయారు! కరీంనగర్ జిల్లాలో గురువారం జిరిగిన శిబిరానికి కేసీఆర్ హాజరయ్యారు. నాగరాజు అనే నాయకుడు పార్టీలో తనకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పుకోవడానికి ప్రయత్నించారు. టీఆర్ఎస్ ఇన్చార్జి రాంరెడ్డి వర్గీయులు ఆయనను అడ్డుకోవడంతో... కేసీఆర్ ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్పాలడ్డారు.
ఈ విషయాన్ని ఎవరు పట్టించుకోకపోవడంతో, అక్కడ ఉన్న పొలీసులు నాగరాజును అసుపత్రికి తరలించారు. కానీ నాగరాజు మరణించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ నాగరాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు.. కానీ కేసీఆర్ మాత్రం హైదరాబాద్కు వెళ్లిపోయారు. నాగరాజు కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించకపోవడం పై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ శాడిస్ట్ లా మారిపోయాడని అనుకుంటున్నారట.
నాగరాజు మృతికి సంతాపంగా ఆయన వర్గానికి చెందిన టీఆర్ఎస్ శ్రేణులు.. పేదలకు టీఆర్ఎస్లో స్థానం లేదని ఆరోపిస్తూ టీడీపీ, వైసీపీ మంథని బంద్కు పిలుపునిచ్చాయి.