జగన్ ప్రమాణస్వీకారానికి కేసీఆర్

 

ఏపీ ఎన్నికల పోరులో ఘన విజయం సాధించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఆయన విజయవాడలోనే ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించారు. కాగా జగన్ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆహ్వానించారు. జగన్ ప్రమాణ స్వీకారానికి హాజరవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. గత కొంతకాలంగా కేసీఆర్, జగన్ లు సన్నిహితంగా ఉంటున్నారు. ఏపీలో జగన్ గెలవాలని కేసీఆర్ బలంగా కోరుకున్నారు. అప్పుడే రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలుంటాయన్నారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఏపీలో ఏర్పాటు కానుండటంతో.. కేసీఆర్ తో పాటు తనయుడు కేటీఆర్, కొందరు నేతలు కూడా ప్రమాణస్వీకారానికి హాజరయ్యే అవకాశాలున్నాయి.