కాళేశ్వరం ప్రారంభోత్సవం.. మేడిగడ్డ చేరుకున్న ఏపీ సీఎం
posted on Jun 21, 2019 10:47AM
కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. కాసేపట్లో ఈప్రాజెక్టును తెలంగాణ సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేయనున్నారు. ఈ సందర్భంగా మేడిగడ్డ బ్యారేజీ వద్ద వేద పండితులు జల సంకల్ప హోమం నిర్వహించారు. శృంగేరి పీఠానికి చెందిన ఫణిశశాంక్ శర్మ, గోపీకృష్ణ ఆధ్వర్యంలో 40 మంది వేద పండితులు హోమం నిర్వహించారు. అంతకు ముందు గోదావరిమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజాకార్యక్రమాలు నిర్వహించారు. కేసీఆర్ దంపతులు మహాసంకల్పయాగంలో పాల్గొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక హెలికాప్టర్లో మేడిగడ్డ చేరుకున్నారు. ఈసందర్భంగా పలువురు తెలంగాణ మంత్రులు జగన్కు స్వాగతం పలికారు. జగన్ వెంట ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్కుమార్ యాదవ్ ఉన్నారు. టీఆర్ఎస్ ముఖ్యనేతలు, రాష్ట్రమంత్రులు, అధికారులు మేడిగడ్డ చేరుకున్నారు.