తెలంగాణ అసెంబ్లీ రద్దు
posted on Sep 6, 2018 1:59PM
గత కొద్దిరోజులుగా నానుతున్న అసెంబ్లీ రద్దు అంశానికి ఎట్టకేలకు తెరపడింది.. అసెంబ్లీని రద్దు చేస్తూ తెలంగాణ మంత్రివర్గం ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది.. ఈరోజు మధ్యాహ్నం సమావేశమైన మంత్రివర్గ సమావేశంలో ఏకవాక్య తీర్మానంపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు.. తీర్మాన ప్రతిని గవర్నర్ నరసింహన్కు అందజేసేందుకు సీఎం కేసీఆర్ సహా మంత్రివర్గ సహచరులందరూ రాజ్భవన్కు వెళ్లారు.. ఏ పరిస్థితుల్లో అసెంబ్లీ రద్దు నిర్ణయం తీసుకున్నామన్న అంశంపై కేసీఆర్ గవర్నర్కు వివరించారు.. గవర్నర్తో భేటీ అనంతరం కేసీఆర్ గన్పార్క్ వద్దకు చేరుకుని అమరవీరులకు నివాళులర్పించనున్నారు.. అక్కడి నుంచి తెలంగాణ భవన్కు చేరుకుని మధ్యాహ్నం 2.30 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు.