కర్ణాటక ఎన్నికలపై సర్వే... కాంగ్రెస్ ఓకే కానీ..!

 

కర్ణాటకలో వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో జరగనున్న సంగతి తెలిసిందే. ఇక ఎన్నికల సమయంలో సర్వేలు చేయడం..ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అని చెప్పడం కామనే. ఇప్పుడు ఈ ఎన్నికల నేపథ్యంలో కూడా ఇండియా టుడే-కార్వీ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 113 సీట్లు అవసరం కాగా, కాంగ్రెస్‌ 90-101, బీజేపీ 78-96 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని తెలిపింది. బీఎస్పీ-జేడీఎస్ 34 నుంచి 43 స్థానాల్లో గెలిచి ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించనున్నట్టు సర్వే తెలిపింది. ముఖ్యమంత్రిగా ఎవరికి మద్దతు ఇస్తారని ప్రశ్నించగా 33 శాతం మంది సిద్ధరామయ్యకు మద్దతివ్వగా..యడ్యూరప్పకు 26 శాతం మంది, కుమారస్వామికి 21 శాతం మంది మద్దతు పలికారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌పై పెద్దగా వ్యతిరేకత లేకపోయినా ఈసారి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు వచ్చే అవకాశం లేదని ఒపీనియన్ పోల్ తేల్చి చెప్పింది. లింగాయత్‌ల మైనారిటీ హోదా బీజేపీ ఓటు బ్యాంకును చీల్చే అవకాశం ఉందని పేర్కొంది.