సంబరాల్లో మునిగిన బీజేపీ...

కర్ణాటక అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతోంది. బైపోల్స్ నిర్వహించిన 15 స్థానాలకు గాను 11 చోట్ల బిజెపి అభ్యర్ధులు ముందంజలో ఉన్నారు. రెండో రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ రెండు చోట్ల జేడీఎస్ ఒక్కచోట ఆధిక్యంలో ఉన్నాయి. ఒక్కచోట స్వతంత్ర అభ్యర్థి లీడ్ లో ఉన్నారు. హస్ కోటలో బీజేపీ రెబల్ అభ్యర్థి శరద్ కుమార్ బచ్చే గౌడ తన సమీప ప్రత్యర్థి పై 1700 ల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. క్రిష్ణరాజపేటలో బిజెపి అభ్యర్థి వెనుకంజలో ఉన్నారు. అక్కడ జేడీఎస్ అభ్యర్థి 1000 ఓట్ల లీడ్ లో కొనసాగుతున్నారు. ఇక హస్నూరు, శివాజినగర్ లో కాంగ్రెస్ అభ్యర్ధులు లీడ్ లో ఉన్నారు. 14 మంది కాంగ్రెస్ ముగ్గురు జేడీఎస్ సభ్యుల రాజీనామాలతో నాలుగు నెలల క్రితం కాంగ్రెస్ జేడీఎస్ సర్కారు కూలిపోయింది. 2 స్థానాల మినహా 15 చోట్ల ఈ నెల 5 న ఉప ఎన్నికలు జరిగాయి. దాంతో ప్రభుత్వ మనుగడకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 112 కు చేరుతుంది. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలంటే బిజెపికి కనీసం 6 స్థానాల్లో గెలవటం తప్పనిసరి. ప్రస్తుతం ఆ పార్టీకి 105 మంది సభ్యులున్నారు. అయితే ఇప్పుడు ఫలితాల్లో 11 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉండటం ఆ పార్టీ శ్రేణులను ఉత్సాహంలో నింపుతోంది. కర్ణాటక వ్యాప్తంగా బిజెపి శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.