కర్ణాటకలో ఎన్నికలు.. లక్షల్లో బెట్టింగులు

 

రేపు (మే 12) కర్ణాటక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే పార్టీలన్నీ తమ వ్యూహలతో ముందు వెళుతున్నారు. ఇక పోలింగ్ అధికాలు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇదిలా ఉండగా ఈ ఎన్నికల నేపథ్యంలో అప్పుడే  బెట్టింగులు జోరందుకున్నాయి.  సీటు, స్థానాలను బట్టి రూ.20 లక్షలతో మొదలుకుని రూ.50 లక్షల వరకు కాసేందుకు పందెంరాయుళ్లు ముందుకొస్తున్నారు. బీజేపీ కంటే కాంగ్రెస్‌కు ఐదు స్థానాలు ఎక్కువ వస్తాయని ఒకరు రూ.20 లక్షలు పందెం కట్టినట్టు సమాచారం. అలాగే బీజేపీకి 115 స్థానాలకు మించి ఒక్క సీటు కూడా ఎక్కువ రాదని మరో వ్యక్తి రూ.50 లక్షలు పందెం కాయడం గుంటూరులో హాట్ టాపిక్ అయింది. అయితే బీజేపీకి వ్యతిరేకంగా బెట్టింగ్ కాస్తున్నవారే ఎక్కువమంది కనిపిస్తుండడం గమనార్హం.