కాపు రిజర్వేషన్ల బిల్లుకు కేంద్రం బ్రేక్..

 

కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈ బిల్లును కేంద్రానికి పంపగా.. తాజాగా కేంద్రం ఈబిల్లుకు అడ్డుకట్ట వేసినట్టు తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీలో ఈ బిల్లు ఆమోదం పొందిన తరువాత.. నిబంధనల ప్రకారం గవర్నర్ దానిని రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. అయితే బిల్లు ఆమోదానికి ముందు రాష్ట్రపతి కేంద్ర హోంశాఖ సలహాలు, సూచనలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ బిల్లును  నిలిపివేయాలంటూ... కేంద్రం హోంశాఖకు సూచించింది.  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా ఉండాలని స్పష్టం చేసింది.