రెండేళ్లుగా కాంగ్రెస్ పార్టీకి టీడీపీ మద్దతు..!!

 

ఓ వైపు కాంగ్రెస్, టీడీపీ పొత్తు గురించి తీవ్ర చర్చలు జరుగుతుంటే.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాత్రం టీడీపీ, కాంగ్రెస్ తో ఎప్పటినుండో రహస్య పొత్తు కొనసాగిస్తోంది అంటూ టీడీపీపై విమర్శలు చేసారు.. తాజాగా కన్నా మాట్లాడుతూ.. టీడీపీ మాతో ఉంటూనే రాహుల్‌తో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆరోపించారు.. రెండేళ్లుగా కాంగ్రెస్ పార్టీకి టీడీపీ పలు అంశాల్లో మద్దతుగా నిలబడిందని  అన్నారు.. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ తెలుగుదేశమని.. ఇప్పుడు అదే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఎన్టీఆర్ సిద్ధాంతాలను హత్య చేశారని కన్నా విమర్శించారు.. టీడీపీ తెలుగు డ్రామా కంపెనీగా మారిందని తెలుగు ప్రజలు గుర్తించాలన్నారు.