కంచె ఐలయ్యపై ఏపీలో కేసు నమోదు

ప్రముఖ కవి, రచయిత ప్రొఫెసర్ కంచె ఐలయ్యపై ఆంధ్రప్రదేశ్‌లో కేసు నమోదైంది. ఆయన రచించిన సామాజిక స్మగ్లర్లు-కోమటోళ్లు పుస్తకంలో తమ మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయంటూ తెలుగు రాష్ట్రాల్లో ఆర్యవైశ్యులు రోడ్ల మీదకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ కులాన్ని కించపరిచేలా...తమను స్మగ్లర్లుగా పేర్కొన్న ఆ పుస్తకాన్ని నిషేధించాలని వారు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ డీజీపీ సాంబశివరావును కలిసిన ఆర్యవైశ్య ప్రతినిధులు కంచె ఐలయ్యపై ఫిర్యాదు చేశాయి. దీంతో ఆయనపై కేసు నమోదు చేయాల్సిందిగా సీఐడీ అధికారులను డీజీపీ ఆదేశించారు. సీఎం చంద్రబాబుతో చర్చించిన తర్వాతే డీజీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.