కాకినాడ మేయర్‌గా సుంకర పావని

గత కొంతకాలంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేపిన కాకినాడ నగర పాలక సంస్థ మేయర్ అభ్యర్థి ఎవరో తేలిపోయింది. అనేక తర్జనభర్జనలు, లెక్కలు తీసివేతల అనంతరం మేయర్ అభ్యర్థిగా సుంకర పావనిని ఎంపిక చేసింది టీడీపీ అధిష్టానం. అలాగే డిప్యూటీ మేయర్‌ అభ్యర్థిగా కాలా సత్తిబాబును ఎంపిక చేసింది. అందరి అభిప్రాయాలు తీసుకున్న అనంతరం మేయర్ అభ్యర్థి ఎంపిక నిర్ణయాన్ని మంత్రులు, పార్టీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అప్పగించారు. అన్ని అంశాలను పరిశీలించిన మీదట మేయర్ అభ్యర్థిగా సుంకర పావని పేరును అధికారికంగా ప్రకటించాలని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును సీఎం ఆదేశించారు.