ఎస్వీబీసీ చైర్మన్గా జర్నలిస్ట్ స్వప్న!!
posted on Jan 13, 2020 1:35PM
శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్(ఎస్వీబీసీ) చైర్ పర్సన్ గా జర్నలిస్ట్ స్వప్నను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం స్వప్న ఎస్వీబీసీ డైరెక్టర్గా సేవలు అందిస్తున్నారు. కొద్ది రోజులుగా ఎస్వీబీసీలో వివాదాస్పద పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. లంచాలు తీసుకొని కొందరికి అక్రమంగా ఉద్యోగాలు ఇచ్చారని ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ పై ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు ఆయన ఓ మహిళా ఉద్యోగితో ఫోన్ లో శృంగార సంభాషణలు చేసినట్టు ఆడియో కలకలం రేపింది. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో.. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదేశం మేరకు.. ఎస్వీబీసీ చైర్మన్ పదవికి పృథ్వీ రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం ఎస్వీబీసీ డైరెక్టర్గా ఉన్న స్వప్న.. ఆ సంస్థ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించనున్నట్టు ప్రచారం జరుగుతోంది.