సీఎం రమేష్ దీక్షకు ఊహించని మద్దతు

 

కడప ఉక్కు పరిశ్రమ కోసం సీఎం రమేష్ ఆమరణ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే.. ఇప్పటికే దీక్ష పదో రోజుకు చేరుకుంది.. ఆరోగ్యం క్షీణిస్తున్నా ఉక్క పరిశ్రమ ఏర్పాటుకు అనుకూలంగా కేంద్రం స్పష్టమైన నిర్ణయం చెప్పేవరకు వెనకడుగు వేయనని, సీఎం రమేష్ పట్టుదలగా దీక్ష చేస్తున్నారు.. ఈ దీక్షకు రోజురోజుకు విపరీతంగా మద్దతు పెరిగిపోతుంది.. తాజాగా సీఎం రమేష్ దీక్షకు పలువురు నేతలు, ప్రముఖులు మద్దతు పలికారు.. వారిలో మాజీ ఐఏఎస్ జేడీ లక్ష్మినారాయణ కూడా ఉండటం విశేషం.. సీఎం రమేష్ ని పరామర్శించిన లక్ష్మి నారాయణ ఈ సందర్బంగా మాట్లాడుతూ..ఎంపీ సీఎం రమేష్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నా ఉక్కుదీక్షను కొనసాగించడం అభినందనీయమని కొనియాడారు.. అలానే దీక్షకి మద్దతు తెలిపిన వారిలో ఊహించని మరో వ్యక్తి కూడా ఉన్నారు.. ఆయనే బండ్ల గణేష్.. ఉక్కు పరిశ్రమ కోసం సీఎం రమేష్ చేస్తున్న దీక్షకు భారీ మద్దతు వస్తుండటంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.