జగన్ సీఎం కావాలని అప్పుడే ఫిక్స్ అయినట్టున్నాడు..!

 

టైం  దొరికినప్పుడల్లా టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై కామెంట్లు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు తాజాగా మరోసారి జగన్ పై జేసీ దివాకర్ రెడ్డి విమర్సలు గుప్పించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ తన తల్లి విజయమ్మ గర్భంలో ఉన్నప్పుడే ‘ముఖ్యమంత్రిని కావాలి’ అని కలవరించి ఉంటాడని చమత్కరించారు. అదేవిధంగా, పవన్ కల్యాణ్ కూడా ముఖ్యమంత్రి కావాలనే కలలు కంటున్నారని, వాళ్లిద్దరి కలలు   నెరవేరనవి అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పై జేసీ విమర్శలు చేశారు. నాడు సోనియాగాంధీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్న నరసింహన్, నేడు ప్రధాని మోదీకి అత్యంత సన్నహితుడిగా మారిపోయారని వ్యాఖ్యనించారు.