పవన్ పట్టించుకోవడం లేదు... అందుకే...

 

లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ జేఎఫ్సీ తరహాలోనే ఇండిపెండెంట్ గ్రూప్ ఆఫ్ ఎక్స్ పర్ట్స్(ఐజీఎఫ్) పేరిట ఓ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే కదా. అయితే ఈ కమిటీ  తొలి సమావేశం ఈ రోజు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను తొలుత తెరపైకి తెచ్చింది తానేనని, ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి హోదా వచ్చే అవకాశమే లేదని, ఈ విషయం అన్ని రాజకీయ పార్టీలకు తెలుసని అన్నారు. పేరు ఏదైనా కావచ్చు కానీ, రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నీ రావాలని ఆకాంక్షించారు. ఇంక జేఎఫ్‌సీ కమిటీపై కూడా ఆయన మాట్లాడుతూ... పవన్ కల్యాణ్ దీనిపై మొదట శ్రద్ధ చూపించారు కానీ... తరువాత పట్టించుకోవడం లేదని అన్నారు. జేఎఫ్‌సీ నివేదిక ఇచ్చిన తరువాత దానిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, అందుకే తాను స్వతంత్ర నిపుణుల కమిటీ ఏర్పాటు చేశానని తెలిపారు. జేఎఫ్‌సీ తొలిదశ అయితే, స్వతంత్ర నిపుణుల కమిటీ రెండో దశ అని వ్యాఖ్యానించారు.