జవాన్లపై రాళ్ల దాడి...


జమ్మూకాశ్మీర్ లోని జవాన్ల పై రాళ్లదాడి జరిగింది. జమ్మూకాశ్మీర్ లోని ఛాదూరా ప్రాంతంలో మిలిటెంట్లు ఉన్నారన్న సమాచారం అందడంతో భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో మిలిటెంట్లకు, భద్రతా సిబ్బందికి మధ్య కాల్పులు జరిగాయి. ఆసమయంలో అక్కడ గుమిగూడి ఉన్న స్థానికులు, భద్రతా సిబ్బంది పైకి రాళ్లు రువ్వుతూ ఆందోళన చేపట్టారు. దీంతో వారిని అదుపుచేసేందుకు భద్రతా సిబ్బంది వారిపై కూడా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించగా నలుగురు గాయపడ్డారు.