కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్..తప్పించుకున్న ఉగ్రవాదులు

జమ్మూకశ్మీర్‌లో ఉదయం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. కేరీ సెక్టార్‌లో భారత్‌లో చోరబడేందుకు కొందరు ఉగ్రవాదులు ప్రయత్నించడంతో భద్రతా దళాలు అప్రమత్తమై వారిని అడ్డుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమవ్వగా..మిగిలిన వారు తప్పించుకున్నట్లు సమాచారం. తప్పించుకున్న ముష్కరుల కోసం సైన్యం గాలింపు చర్యలు చేపట్టింది. ఘటనా ప్రదేశం నుంచి భారీగా ఆయుధాలు, ముందుగుండు స్వాధీనం చేసుకున్నారు.