మోడీని విమర్శిస్తే జగన్ జైలుకే

 

ఏపీ మంత్రి నారా లోకేష్ ఈ మధ్య దూకుడు బాగా పెంచారు.. ఒకవైపు ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు, మరోవైపు విపక్షాలకు చురకలు వేస్తున్నారు.. తాజాగా లోకేష్ విపక్ష నేత జగన్ మీద విమర్శలు చేసారు..ఏపీకి అన్యాయం చేసిన మోడీని జగన్ ఒక్కమాట కూడా అనరని, ఒకవేళ మోడీని విమర్శిస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందని జగన్‌కు భయం పట్టుకుందని లోకేష్ విమర్శించారు.. జగన్, మోడీతో కలిసిపోయి తనపేరుని జగన్ మోడీ రెడ్డిగా మార్చుకున్నారని చురక వేశారు.. అలానే టీడీపీ వచ్చే ఎన్నికల్లో 25 ఎంపీ స్థానాలు గెలిచి రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధిస్తామని అన్నారు.