వైసీపీ ఓటమికి కారణం నేనే అంటున్న జగన్..!!

వైసీపీ అధినేత జగన్ రీసెంట్ గా ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.. ఈ సందర్బంగా మాట్లాడిన జగన్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.. బీజేపీతో తమకు ఎలాంటి లాలూచీ లేదని, మోడీని తాను ఎన్నోసార్లు విమర్శించానని, రాష్ట్రానికి అన్యాయం చేసిన మోడికి తాను సున్నా మార్కులు వేస్తానని అన్నారు.. అలానే ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకి కేంద్రంలో తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేసారు.

 

 

దేవుడు ఆశీర్వదిస్తే తాను 2019లో ముఖ్యమంత్రిని అవుతానని చెప్పిన జగన్.. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమికి తన నిర్ణయాలు కూడా కొన్ని కారణమని అన్నారు.. నేను కూడా కొన్ని పొరపాట్లు చేశానని చెప్పిన జగన్, అయినా పొరపాట్లు చేయని మనిషి ఎవరున్నారని ప్రశ్నించారు.. 2014 ఎన్నికల్లో చంద్రబాబును బీజేపీ, పవన్ కళ్యాణ్ గెలిపించారని అన్నారు.. చంద్రబాబు అవినీతిపరుడు అని పవన్ ఇప్పుడు బాధపడటంలో అర్థం లేదన్నారు.. గత ఎన్నికల్లో అన్ని రకాలుగా కలిసొచ్చి చంద్రబాబు గెలిచారన్నారు.. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 40 సీట్లకు మించి రావని జగన్ జోస్యం చెప్పారు.