జగన్ పై తిరుగుబాటు మొదలైంది...
posted on Feb 15, 2018 4:42PM
ప్రత్యేక హోదా కోసం మేము కూడా పోరడతామని.. ఏప్రిల్ 6 వ తేదీన ఎంపీలందరూ రాజీనామా చేస్తారని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేసిన సంగతి తెలిసిందే కదా. దీనివెనుక జగన్ ప్లాన్ కూడా అందరికీ అర్దమైంది. అయితే ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం ఒకటి బయటకు వచ్చింది. ఎంపీలు అందరూ రాజీనామా చేస్తారంట కానీ.. విజయసాయిరెడ్డి మాత్రం రాజీనామా చేయరంటా. ఈ మాట చెప్పింది ఎవరో కాదు స్వయంగా జగనే.
దీంతో మిగిలిన ఎంపీలు జగన్ పై తిరుగుబాటు చేశారు. ఎంపీలు రాజీనామా అంటే విజయసాయిరెడ్డి కూడా చేయాల్సిందే అని ఎంపీలు ఎస్పీ సుబ్బారెడ్డితో సహా అందరూ పట్టుబట్టారట. అయితే దీనికి జగన్.. ఢిల్లీలో మన తరపున లాబీయింగ్ కి సాయన్న అవసరం ఉందని అన్నారట. ఆ విషయం మనకు తెలుసు కానీ..ప్రజలకు చెప్పలేం కదా... ఎంపీలందరూ రాజీనామా చేసి విజయసాయిరెడ్డి ఎందుకు చేయలేదు అని ప్రశ్నిస్తే ఏం చెబుతాం అని జగన్ కు గట్టిగానే సమాధానం చెప్పారంట. అంతేకాదు.. ఇప్పటికే విజయసాయిరెడ్డి బీజేపీ నేతలతో కలుస్తూ ఫొటోలు దిగుతున్నారు.. దాంతో అందరూ మనం బీజేపీతో మ్యాచ్ ఫిక్స్ చేసుకున్నామనే అంటున్నారు.. ఇప్పుడు ఆయన రాజీనామా చేయకపోతే మనంతట మనమే అది నిజం చెప్పినట్టు అవుతుంది.. అని అన్నారట. మరి ఇప్పటికే జగన్ తన మోనార్క్ తెలివితేటలు చూపించి... చాలా మంది నేతలను దూరం చేసుకున్నాడు. ఇప్పుడు ఉన్న ఈ కొంతమందిని కూడా దూరం చేసుకుంటే... పార్టీ చేతులెత్తేసినట్టే. మరి అందరికీ ఒక న్యాయం.. ఇంటి వాళ్లకు ఒక న్యాయం అంటే రాజకీయాల్లో కుదరదు కదా మరి..