పవన్‌, జగన్‌ సభలకు వచ్చే జనమంతా ఓటర్లు కాదు..!

 

సినీనటుడు, బీజేపీ సీనియర్ నాయకుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు.. తాజాగా మీడియాతో మాట్లాడుతూ ప్రభాస్ రాజకీయ ప్రవేశం గురించి.. అలానే పవన్, జగన్ సభల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.. ప్రభాస్‌కు బీజేపీతో సంబంధం లేదని, వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసినా ప్రభాస్‌ ప్రచారానికి రాడని స్పష్టం చేసారు.. ప్రభాస్‌ ఎదుగుతున్న నటుడని, పదేళ్లతోనే సినిమా జీవితం అయిపోలేదని, ఇంకా పాతికేళ్లు నటించాల్సిన ప్రభాస్‌కు అప్పుడే రాజకీయాలు అవసరం లేదని కృష్ణంరాజు అన్నారు.. అదే విధంగా పవన్‌, జగన్‌ సభలకు భారీగా జనం వస్తున్న విషయాన్ని ప్రస్తావించగా.. రాజీవ్‌గాంధీ హయాంలో తాను కాంగ్రెస్‌ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తే జనం విపరీతంగా వచ్చారని, కానీ గెలుపు దక్కలేదని గుర్తుచేసిన కృష్ణంరాజు, సభలకు, యాత్రలకు వచ్చే జనమంతా ఓటర్లు కాదని అన్నారు.