అమెరికాలో తెలుగు యువకడు దారుణహత్య

అమెరికాలో తెలుగు వారిపై జాత్యంహకార దాడులు ఎక్కువ అవుతున్నాయి..కొద్ది రోజుల క్రితం వరంగల్‌కు చెందిన వంశీ దుండగుల కాల్పుల్లో మరణించాడు. తాజాగా కన్సాస్‌లో జరిగిన కాల్పుల్లో మరో తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోగా..మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గత బుధవారం రాత్రి కన్సార్‌లోని ఓ బార్‌లో తెలుగు యువకుడు కూచిబొట్ల శ్రీనివాస్, మేడసాని అలోక్‌రెడ్డి ఉండగా ఓ అమెరికా పౌరుడు వారితో గొడవపడ్డాడు. మీరు మాకంటే ఎందులో గొప్ప..? మా దేశం విడిచి వెళ్లిపోండి అంటూ వారితో వాగ్వివాదానికి దిగాడు..ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన అతను తుపాకీతో కాల్పులు జరిపాడు..దీంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మరణించగా..అలోక్‌రెడ్డితో పాటు ఈ దాడిని ఆపేందుకు ప్రయత్నించిన ఇయాన్ గ్రిలాట్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే శ్రీనివాస్ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు.