మీరు ఊ అనండి చాలు.. పాక్ కి చుక్కలు, మనకి పీవోకే!!

 

భారత ప్రభుత్వం తీసుకున్న 'ఆర్టికల్ 370' రద్దు నిర్ణయంతో పాక్ రగిలిపోతున్న విషయం తెలిసిందే. కానీ చేసేదేమి లేక రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ కాలం వెళ్లదీస్తుంది. అయితే తాజాగా భారత్ ఆర్మీ పాక్ ని హెచ్చరించి మరింత ఇరుకున పెట్టింది. భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ సంచలన ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)కు విముక్తి కల్పిస్తామని, పాక్ చెర నుంచి స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా పాటించేందుకు సైన్యం సిద్ధంగా ఉందని తెలిపారు. పాక్ నుంచి పీవోకేను స్వాధీనం చేసుకుంటామని ఇటీవల కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో జితేంద్ర సింగ్ వ్యాఖ్యలపై ఢిల్లీలో రావత్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.