మొదటి రోజు భారత్ స్కోర్.. 329/6


భారత్-శ్రీలంక మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. పల్లెకలె వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ ఆట ముగిసే స‌మ‌యానికి భార‌త్ ఆరు వికెట్ల న‌ష్టానికి 329 ప‌రుగులు చేసింది. శిఖ‌ర్ ధావ‌న్ మూడ‌వ టెస్టులో దుమ్మురేపాడు. టెస్టుల్లో ఆర‌వ సెంచ‌రీ న‌మోదు చేశాడు. కేవ‌లం 106 బంతుల్లో 15 బౌండ‌రీల‌తో సెంచ‌రీ పూర్తి చేశాడు. ఇక రాహుల్ 85, కోహ్లీ 42, అశ్విన్ 31, ర‌హానే 17, పుజారా 8 ప‌రుగులు చేసి ఔట్ అవ్వ‌గా.. సాహా 13, పాండ్య 01 ప‌రుగులు చేసి క్రీజులో ఉన్నారు. ఇక‌.. శ్రీలంక బౌల‌ర్లు పుష్ప కుమార 3 వికెట్లు, సంద‌క‌న్ 2, ఫెర్నాండో ఒక వికెట్ తీశారు.