పుణే టెస్టులో తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్

భారత్ ఆస్ట్రేలియాల మధ్య పుణేలో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న ఓపెనర్ డేవిడ్ వార్నర్ 38 పరుగుల వద్ద ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. 27.2 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 82 పరుగులు చేసింది. ప్రస్తుతం షాన్‌మార్ష్, స్టీవెన్ స్మిత్ క్రీజులో ఉన్నారు. అంతకు ముందు టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.