నాలుగో టెస్ట్ మ్యాచ్.. సిరీస్ సొంతం చేసుకున్న భారత్

 

ధర్మశాల వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. ఎనిమిది వికెట్ల తేడాతో ఆస్టేలియాపై భారత్ విజయం సాధించి సరీస్ కైవసం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్ లో మొదట బ్యాటింగ్ చేసిన అసీస్ కేవలం 137 పరుగులు మాత్రమే చేసి అతి స్వల్ప లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచగా..భారత్ ఈరోజు ఆట ప్రారంభించిన కొద్ది సమయానికే లక్ష్యాన్ని చేధించి విజయం సాధించింది. ఆస్ట్రేలియాపై 2-1 తేడాతో సిరీస్ చేజిక్కించుకుంది.

ఆసీస్ మొదటి ఇన్నింగ్స్ - 300
రెండో ఇన్నింగ్స్ - 137

ఇండియా మొదటి ఇన్నింగ్స్ - 332
రెండో ఇన్నింగ్స్ - 106