అదే వాజ్‌పేయికి ఇచ్చే నిజమైన నివాళి- ఇమ్రాన్‌ ఖాన్‌

 

భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి మృతిపట్ల, త్వరలో పాకిస్థాన్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న ఇమ్రాన్‌ఖాన్‌ సంతాపం తెలిపారు.. భారత్‌ - పాకిస్థాన్‌ల మధ్య శాంతి నెలకొల్పేందుకు ఆయన చేసిన కృషి ఎన్నటికీ మరువలేనిదని అన్నారు.. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పేందుకు కృషి చేసిన వాజ్‌పేయి, ప్రధాని అయిన తర్వాత కూడా దాన్ని కొనసాగించారని తెలిపారు.. భారత్‌, పాక్‌ల మధ్య శాంతి నెలకొల్పడమే వాజ్‌పేయీ సాహెబ్‌కు ఇచ్చే నిజమైన నివాళి అని ఇమ్రాన్‌ ఖాన్‌ అన్నారు.