కోహ్లీ నీవల్ల కాదు..ఇక దిగిపో

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్ చేతిలో ఘోర పరాజయం పాలవ్వడంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. దీనికి తోడు కోచ్ అనిల్ కుంబ్లేతో వివాదం బయటకు తెలియడంతో విరాట్‌‌కు ప్రతికూలంగా మారింది. ఈ నేపథ్యంలో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని తప్పించి, తిరిగి ధోనీకి పగ్గాలు ఇవ్వాలన్న డిమాండ్ పెరుగుతోంది. 2019 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కుంబ్లేతో కోహ్లీ విభేధాలే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్‌పై పరాజయానికి కారణమని అభిమానులు మండిపడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ధోనీనే జట్టును ఆదుకోగలడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.