టిక్కెట్ ఇవ్వకపోతే.. మంత్రి పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటా
posted on Sep 22, 2018 11:43AM
తనకు తెరాస నుంచి ఎమ్మెల్యే టిక్కెట్ రాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ హెచ్చరించారు. శుక్రవారం ఎల్బీనగర్లోని శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తనకు హుజూర్నగర్ టిక్కెట్ దక్కకుంటే మంత్రి జగదీశ్రెడ్డి పేరు రాసి ఎల్బీనగర్ రింగ్రోడ్డులో ప్రాణ త్యాగానికి పాల్పడతానని శంకరమ్మ చెప్పారు. హుజూర్నగర్ టిక్కెట్ తనకు కేటాయించేందుకు కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు అనుకూలంగా ఉన్నారని.. అయితే జగదీశ్రెడ్డి వారి వద్ద అసత్యాలు చెప్పి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. బీసీ మహిళైన తాను హుజూర్నగర్లో పోటీ చేయడం మంత్రికి ఇష్టం లేదని, కార్యకర్తల బలం లేదని అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారన్నారు. ఉద్యమంలో తన కుమారుడు శ్రీకాంతాచారి అమరుడై ఉద్యమానికి జీవం పోశాడని, అమరుల కుటుంబాలపక్షాన హుజూర్నగర్ సీటును కేటాయించాలని శంకరమ్మ కోరారు. పార్టీ అధిష్టానం తనకు కేటాయిస్తుందన్న నమ్మకం ఉందని చెప్పారు.