హైకోర్టు ఆదేశంతో పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు..!!

 

ఏపీ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరపాలని అనంతపురం జిల్లా రామగిరి పోలీసులను హైకోర్టు ఆదేశించింది.. అసలు విషయం ఏంటంటే.. ఈ ఏడాది 'ఫిబ్రవరి 7న పేరూరులో వైసీపీ కార్యకర్తల సమావేశం పెట్టామన్న కోపంతో పరిటాల శ్రీరామ్‌ అనుచరులతో తన ఇంటికొచ్చి మారణాయుధాలతో దాడిచేశారని' రామగిరికి చెందిన వైసీపీ కార్యకర్త బోయలక్కెనగారి నారాయణ హైకోర్టులో పిటిషన్‌ వేశారు.. అంతేకాకుండా తనను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి తెల్లకాగితాలపై సంతకాలు తీసుకున్నారని, పోలీసులకు ఈ విషయం తెలిపినా మంత్రి కుమారుడు కావడంతో పోలీసులు తన ఫిర్యాదు పట్టించుకోలేదని నారాయణ పిటిషన్‌లో పేర్కొన్నాడు.. పిటిషనర్‌ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపిన హైకోర్టు కేసు నమోదు చేసి దర్యాప్తు జరపాలని రామగిరి పోలీసులను ఆదేశించింది.