హైదరాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం..ఆరుగురు సజీవదహనం

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. అత్తాపూర్‌లోని ఏవీ-1 కూలర్‌ల ఫ్యాక్టరీలో తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు సజీవదహనం అయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు..షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మరణించిన కార్మికులను బీహార్ రాష్ట్రానికి చెందిన సద్దాం, సాధు, ఇర్ఫాన్ ఖాన్‌, ఆయూబ్‌ ఖాన్‌లుగా గుర్తించారు. ఫ్యాక్టరీ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.