రాజకీయ అవసరాల కోసమే చంద్రబాబు యూటర్న్‌

 

ఐసీయూలో ఉన్న కాంగ్రెస్‌ను చంద్రబాబు బతికించాలని చూస్తున్నారని కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. గుంటూరు ఇన్నర్‌ రింగ్‌రోడ్డు వద్ద భాజపా రాష్ట్ర కార్యాలయ భవనానికి శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.రాష్ట్ర పునర్విభజన చట్టం అమలుకు సిద్ధంగా ఉన్నామని,విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మరింత కృషిచేస్తున్నట్టు చెప్పారు.రాజకీయ అవసరాల కోసమే చంద్రబాబు ప్రత్యేక హోదా పేరుతో యూటర్న్‌ తీసుకున్నారని విమర్శించారు. విజయవాడ అభివృద్ధికి రూ.1000 కోట్లు, అమరావతి నిర్మాణానికి రూ.1500 కోట్లు ఇచ్చామని రాష్ట్రానికి ఇచ్చిన నిధుల వివరాలను రాజ్‌నాథ్‌ చెప్పుకొచ్చారు. పోలవరం నిర్మాణానికి నూటికి నూరు శాతం నిధులు ఇస్తున్నట్టు స్పష్టంచేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ఎనిమిది బెటాలియన్లు మంజూరు చేశామని, అదీ రాష్ట్ర అభివృద్ధి పట్ల తమ నిబద్ధత అన్నారు.ఏపీకి ప్రత్యేక ప్యాకేజీనే కాదు స్పెషల్‌ ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నాం అని అన్నారు.