విద్వేష దాడి..అమెరికాలో కాదు ఇండియాలోనే

ఇప్పటి వరకు విదేశాల్లో మాత్రమే భారతీయులపై విద్వేషదాడి జరిగిందని మనం వార్తలు చూస్తున్నాం..అలాంటిది ఏకంగా ఇండియాలోనే విద్వేషదాడులు జరిగితే..వినడానికే వెన్నులో వణుకు పుడుతుంది కదు. ఢిల్లీ నుంచి మధుర వెళ్తున్న ట్రైన్‌లో నలుగురు ముస్లిం యువకులు ప్రయాణిస్తున్నారు. సరిగ్గా ఆ సమయంలోనే అక్కడికి 15 మంది బ్యాచ్ వచ్చి కూర్చొన్న సీట్లు తమకు ఇచ్చి వేరే చోటికి వెళ్లిపోవాలని హెచ్చరించారు. అందుకు వారు నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన ఓ హిందూ యువకుడు వారిని గొడ్డు మాంసం తినేవాళ్లకి సీట్లు ఎందుకని అన్నాడు. దీనిపై ఇరు వర్గాలకు వాగ్వివాదం జరిగింది. చివరకు 15 మంది కలిసి ఆ నలుగురినీ చితకబాదారు. అంతేకాదు ఓ యువకుడిని కత్తితో పొడిచి చంపేశారు. మిగిలిన ప్రయాణికులు అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో వారు అక్కడి నుంచి పారిపోయారు. గాయపడిన యువకులను ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు నిందితులను గాలించే పనిలో పడ్డారు.